పెద్దపప్పూరు మండలంలోని జోడిదర్మాపురం టోల్ ప్లాజా వద్ద పెన్నానది నుంచి అక్రమంగా ఇసుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ను సీజ్ చేశామని ఎస్ఐ గౌస్ బాషా శనివారం తెలిపారు. తాడిపత్రి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన హరి కృష్ణ, రాజారెడ్డిపై కేసు నమోదు చేశామన్నారు. పెన్నానది నుంచి అక్రమంగా ఇసుక తరలించకుండా ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు.