భారత జట్టు టీ-20 ప్రపంచకప్ గెలవడంతో ప్రజలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ప్రజలు రోడ్డుపై బాణసంచా పేలుస్తూ సంతోషం వ్యక్తం చేశారు. మరి కొంతమంది తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రజలు అశోక్ పిల్లర్ సర్కిల్ వద్ద తారాజువ్వలతో హోరెత్తించారు.