తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సతీమణి కేతిరెడ్డి రమాదేవి మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ నగర్ లో ఆమె పర్యటించారు. ఈ మేరకు ఆమె పర్యటిస్తూ ప్రజల యోగక్షేమాలను, వారి సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటుగా, వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.