కుమారుడి చేతిలో తండ్రి హతమైన ఘటన కూడేరు మండలంలో చోటు చేసుకుంది. కమ్మూరుకు చెందిన ఆంజనేయులు(65) మానసిక వ్యాధితో బాధ పడుతున్నాడు. గ్రామంలో కనిపించిన వారందరినీ తిట్టుకుంటూ తిరిగేవాడు. స్థానికులు భరించలేక అతని కుమారుడు తిరుపాల్ ను మందలించేవారు. ఆవేశానికి గురైన తిరుపాల్ బుధవారం సాయంత్రం ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకొని గడ్డపారతో తలపై బలంగా కొట్టాడు. దింతో అనంతపురం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.