పెట్టుబడి సాయం రూ. 20 వేలు ఇవ్వాలి: సీపీఎం

75చూసినవారు
పెట్టుబడి సాయం రూ. 20 వేలు ఇవ్వాలి: సీపీఎం
వజ్రకరూరు మండల తహాశీల్దార్ కు రైతులు, సీపీఎం నాయకులు వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జి.విరుపాక్షి, మండల నాయకులు సుధాకర్ నాగేంద్ర, శివ ఆంజనేయులు, నారాయణస్వామి, భాష, మద్దిలేటి బూసి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎపి రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జి.విరుపాక్షి మాట్లాడుతూ.. రైతులకు పంట పెట్టుబడి సాయం రూ. 20, 000 ఇస్తామని కూటమి ఎన్నికలలో హామీ ఇచ్చింది అన్నారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేసి, కష్టాలసుడిగుండంలో వున్న రైతాంగాన్ని ఆదుకోవాలని ఎపి. రైతుసంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

సంబంధిత పోస్ట్