మంగళవారం ఆమదాలవలస మండలం లొద్దలపేట గ్రామంలో వేంచేసియున్న శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం అష్టమ వార్షికోత్సవ వేడుకలు కడువైభవంగా నిర్వహించబడ్డాయి. ఉదయం 6-03 గంటల నుండి హనుమత్ పతాకావిష్కరణ, అఖండ దీపొద్దీపనం, శ్రీ విఘ్నేశ్వర, షిరిడీ సాయి సహిత శ్రీ అభయాంజనేయ స్వామి వార్లకు సుప్రభాతపూజలు. ఉదయం 7. 30 గంటలకు స్వామివార్లకు విశేష పూజలు, అభిషేకాలు, అర్చనలు, హోమములు జరిపారు.