లోతు ప్రాంతాలను ఎమ్మెల్యే సతీమణి పరిశీలన

53చూసినవారు
లోతు ప్రాంతాలను ఎమ్మెల్యే సతీమణి పరిశీలన
పొందూరు మండల కేంద్రంలో ఎరుకుల కాలనీలో ఇటీవల కురుస్తున్న వర్షం కారణంగా చెరువుల నుంచి ఊర్లోకి వరద నేపథ్యంలో ఆముదలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ సతీమణి మాజీ ఎంపీపీ కూన ప్రమీల ఆధ్వర్యంలో గతంలో మూసిపోయిన కల్వర్టును జెసిబితో తీయించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు రామ్మోహన్, ఉపాధ్యక్షులు శేషగిరి నాయుడు, పట్టణం అధ్యక్షులు రంగా, నాయకులు శంకర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్