తెలుగు ప్రజలకు రామోజీరావు మార్గదర్శకుడు

74చూసినవారు
ప్రముఖ పత్రిక సంస్థల అధినేత రామోజీరావు మృతి పట్ల విజయనగరం టీడీపీ ఎంపీ, ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ సీనియర్ నేత కలిశెట్టి అప్పలనాయుడు సంతాపం వ్యక్తం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కలిశెట్టి శనివారం ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు. తెలుగు ప్రజలకు, వ్యవస్థకు రామోజీరావు మార్గదర్శకుడు అని కొనియాడారు. గతంలో ప్రముఖ పత్రిక రిపోర్టర్ గా తను పనిచేసేటప్పుడు ఆయన చూపిన మార్గం ఈరోజు సమాజానికి ఉపయోగపడే విధంగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్