బోటు బోల్తా పడి మత్స్యకారుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం ఉదయం శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. ఎచ్చెర్ల మండలం డి. మత్స్యలేశం గ్రామానికి చెందిన మూగి యర్రయ్య (55) వేటకు వెళ్లి మృతి చెందినట్లు సమాచారం. ఉదయం సముద్రంలో వేటకు వెళ్లగా. బోటు బోల్తా పడి ఆయన మృతి చెందినట్లు మత్స్యకారులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.