బారువలో జగన్నాథ రథయాత్రకు సర్వం సిద్ధం

71చూసినవారు
సోంపేట మండలంలోని బారువ గ్రామంలో రేపు ఆదివారం నిర్వహించనున్న జగన్నాథ రథయాత్రకు సర్వం సిద్ధమైందని నిర్వాహకులు శనివారం తెలిపారు. స్థల పురాణం ప్రకారం పాండవులు నడిచిన నేల ఇది అని, ఈ ఆలయంలో పాండవులు పూజలు నిర్వహించారని స్థానికుల నమ్మకం. ఈ రథయాత్రలో పాల్గొనే భక్తులు బారువ సాగర తీరాన్ని సందర్శిస్తారని, ఈ ఉత్సవాలు తొమ్మిది రోజులపాటు ఘనంగా నిర్వహిస్తామని నిర్వాహకులు చెప్పారు.

సంబంధిత పోస్ట్