చెరువులో జారి పడి వ్యక్తి మృతి

74చూసినవారు
చెరువులో జారి పడి వ్యక్తి మృతి
చెరువులో జారి పడి ఒక వేతన దారుడు మృతి చెందిన ఘటన రణస్థలం మండలంలో గురువారం జరిగింది. స్థానికుల వివరాల మేరకు ప్రతివాడుపాలెం కు చెందిన సన్యాసి రావు(53)ఉపాధి పనులకు వెళ్ళాడు. పని పూర్తయిన తర్వాత గట్టు పై కాళ్లు, చేతులు శుభ్రం చేసుకుంటుండగా ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి మృతి చెందాడు. ఈయనకు భార్య గంగమ్మ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు ఎస్సై చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్