ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే

61చూసినవారు
రణస్థలం మండల కేంద్రంలోని ప్రాథమికొన్నత పాఠశాలను ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు గురువారం మధ్యాహ్నం ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా పాఠశాల ఆవరణను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం పాఠశాలలో బాగుంటుందా లేదా అని ఆరా తీశారు. విద్యార్థులకు అన్ని మౌనిక సౌకర్యాలు కల్పించేలా చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్