ఇచ్ఛాపురం మండలంలోని డొంకూరు పంచాయతీలో టిడిపి శ్రేణులు శుక్రవారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇచ్ఛాపురం ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్, జనసేన ఇన్ఛార్జ్ దాసరి రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు. టీడీపీ-జనసేన-బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్చార్జిలు, అనుబంధ విభాగాల సభ్యులు పాల్గొన్నారు.