పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి సోమవారం మెలియాపుట్టి మండలంలో పర్యటించారు. గంపలతో మట్టిని మోసి ఉపాధి వేతనదారులతో కలిసి పనిచేశారు. అనంతరం జగన్మోహన్ రెడ్డి పథకాలు వివరిస్తూ మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి చేయాలని కోరారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాను గుర్తుపై ఓట్లు వేసి ఎమ్మెల్యేగా రెడ్డి శాంతిని, ఎంపీగా గెలిపించాలని మహిళలకు కోరారు. పాతపట్నం నియోజకవర్గం జగన్ ద్వారానే అభివృద్ధి చెందుతుందని అన్నారు.