కొత్తూరు మండలం పారాపురం గ్రామ సచివాలయం పరిధిలోని గ్రామ వాలంటీర్లు పదిమంది శుక్రవారం రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన వారు తమ విధులకు ఆటంకం కలిగిస్తూ పనులు చేసుకుకోనీయకుండా ఇబ్బందులు పెడుతున్నారని, మళ్లీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవడానికి వాలంటీర్ పదవులకు రాజీనామా చేస్తున్నామని తెలిపారు. వారి యొక్క రాజీనామా పత్రాలను కార్యదర్శికి అందజేశారు.