AP: రాష్ట్ర సచివాలయంలో రేపు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మధ్యాహ్నం 12 గంటలకు సమావేశం ప్రారంభం అవ్వనుంది. వ్యవసాయ రుణాలు, సంక్షేమ పథకాల అమలు, రుణ లక్ష్యాలపై ఈ భేటీలో చర్చలు జరపనున్నారు. గృహ నిర్మాణానికి గతంలో తీసుకన్న రుణాలపైనా చర్చించే అవకాశం ఉంది.