ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్కు భారీ షాక్ తగిలింది. ఆయనకు సుప్రీంకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. అగ్నిమాపక విభాగంలో జరిగినా అవినీతి కేసులో అతనిపై ప్రభుత్వం ఇటీవల FIR నమోదు చేసింది. ఈ నేపథ్యంలో కేసు కు సంబంధించి ఏపీ హైకోర్టు సంజయ్కు ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని సర్కార్ సుప్రీంకోర్టులో సవాల్ విసిరింది. దీంతో ఏపీ ప్రభుత్వ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని సంజయ్కి సుప్రీం నోటీసులిచ్చింది.