మదనపల్లె ఘటనలో పెద్దిరెడ్డిపై అనుమానం ఉంది: మంత్రి అనగాని

84చూసినవారు
మదనపల్లె ఘటనలో పెద్దిరెడ్డిపై అనుమానం ఉంది: మంత్రి అనగాని
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాద ఘటనలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి, స్థానిక వైసీపీ నేతలపై అనుమానం ఉందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. నిందితులు ఎవరైనా విడిచిపెట్టమని తేల్చిచెప్పారు. పెద్దిరెడ్డి అవినీతి వెలుగులోకి వచ్చాకే ఈ ఘటన జరిగిందని తెలిపారు. ఆర్డీవో, తహశీల్దార్, ఉద్యోగుల ఫోన్లు సీజ్ చేసినట్లు చెప్పారు. అవినీతిని కప్పిపుచ్చేలా ఉద్యోగులు సహకరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్