యువకుడి అనుమానాస్పద మృతి

84చూసినవారు
యువకుడి అనుమానాస్పద మృతి
పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. మృతుడు షేక్ పెద్ద ఖాసింగా గుర్తించారు. ఎన్నికల్లో ఓటు వేసేందుకు కడప నుంచి నరసరావుపేటకు ఖాసిం వచ్చారు. ఓటు వేశాక తురకపాలెంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. రాత్రి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మాట్లాడుతుండగా.. ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది. ఇవాళ తెల్లవారుజామున రైల్వేట్రాక్‌పై ఖాసిం మృతదేహం కనిపించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు.

సంబంధిత పోస్ట్