సీఎం జగన్ పాలనలో సామాజిక న్యాయం జరిగిందని.. బలహీన వర్గాలకు పెద్దపీట వేశారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ తెలిపారు. బీసీలు ఆత్మగౌరవంతో ఉన్నారని, కీలకమైన శాఖలన్నీ బీసీల వద్దే ఉన్నాయని చెప్పారు. బీసీలను అణచివేసింది టీడీపీ అధినేత చంద్రబాబేనని మండిపడ్డారు. సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు.