విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని అఫిడవిట్పై టీడీపీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కేశినేని ట్రావెల్స్లో పని చేసే కార్మికులకు జీతాలు ఎగ్గొట్టిన టైంలో నమోదైన కేసును చూపించలేదని బుద్ధా వెంకన్న ఆరోపించారు. 2014లో రూ.30 కోట్ల బకాయిలు ఉన్నట్లు అఫిడవిట్లో నాని చెప్పారని, ఈసారి అవే అప్పులు చూపారన్నారు. సొంత తల్లితో పాటు కుటుంబ సభ్యులు కూడా నానికి మద్దతు ఇవ్వకపోవడం ఆయన నైజాన్ని తెలియజేస్తుందన్నారు.