కర్ణాటక రాష్ట్రం చామరాజనగర్ బీజేపీ ఎంపీ వి.శ్రీనివాస్ ప్రసాద్ (76) గుండెపోటుతో కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న శ్రీనివాస్ ప్రసాద్ బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కానీ చికిత్స ఫలించక మృతి చెందారు. గత వారం మూత్రాశయం సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించింది. ప్రస్తుతం మైసూర్లోని జయలక్ష్మీపూర్ నివాసానికి భౌతికకాయాన్ని పంపించనున్నారు.