AP: అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
టీడీపీ-
వైసీపీ మధ్య తీవ్ర ఘర్షణ నెలకొనగా.. స్థానిక కాలేజీ గ్రౌండ్కు చేరుకున్న ఇరువర్గాల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. టపాసులు కాలుస్తూ పరస్పరం దాడులకు దిగారు. దీంతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు లాఠీఛార్జ్ చేసి వారిని చెదరగొట్టడానికి విఫలయత్నం చేశారు.