విశాఖ జిల్లాలో తహసీల్దార్ రమణయ్య హత్య దుర్మార్గమని
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ ఘటన రాష్ట్రంలోని శాంతిభద్రతల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందన్నారు. ఉత్తరాంధ్రలో గతంలో ఎన్నడూ ఇలాంటి సంస్కృతి లేదని.. జగన్ పాలనలో ప్రజల ఆస్తులకే కాదు, ప్రాణాలకూ రక్షణ లేదన్నారు. రాష్ట్రంలో నేరాలు జరుగుతుంటే హోంమంత్రి, పోలీసులేరీ? హోంమంత్రి ఎవరో YCP ఎమ్మెల్యేల్లో సగం మందికి తెలియదని ఎద్దేవా చేశారు.