నీట్ పేపర్ లీక్.. రంగంలోకి CBI

74చూసినవారు
నీట్ పేపర్ లీక్.. రంగంలోకి CBI
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఇష్యూపై తాజాగా సీబీఐ కేసు నమోదు చేసింది. కేంద్రం ఆదేశంతో నీట్ ఇష్యూను నిగ్గు తేల్చేందుకు తాజాగా సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసి రంగంలోకి దిగింది. బిహార్‌లో జరిగిన నీట్ పేపర్ లీక్‌తో పాటు గ్రేస్ మార్కులపై కేటాయింపుపై సీబీఐ ఎంక్వైరీ చేయనుంది. నీట్ యూజీ ఎగ్జామ్ ఇష్యూలో వస్తోన్న అన్నీ ఆరోపణలపై సీబీఐ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్