దర్శిలో ఉద్రిక్తత.. వైసీపీ ఎమ్మెల్యే ఆందోళన

53చూసినవారు
దర్శిలో ఉద్రిక్తత.. వైసీపీ ఎమ్మెల్యే ఆందోళన
ప్రకాశం జిల్లా దర్శిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ నేతలపై అక్రమ కేసులకు నిరసనగా పోలీస్ స్టేషన్ ఎదుట ఆ పార్టీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆందోళన చేపట్టనున్నారు. ఈ ఆందోళనలో పాల్గొనేందుకు నియోజకవర్గంలోని అన్ని మండలాల వైసీపీ నేతలు హాజరుకానున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే బూచేపల్లి ఇంటి వద్దకు వైసీపీ శ్రేణులు చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా దర్శిలో భారీగా పోలీసులు మోహరించారు.

సంబంధిత పోస్ట్