దారుణం: రోజూ 200 గుంజీలు.. నడవలేని స్థితిలో విద్యార్థినులు (వీడియో)

51చూసినవారు
ఏపీలోని అల్లూరి జిల్లా రంపచోడవరం ఏపీఆర్ బాలికల జూనియర్ కళాశాలలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. క్రమశిక్షణ పేరుతో ప్రిన్సిపల్ ప్రసూన విద్యార్థినులతో 3 రోజుల పాటు 200 గుంజీలు తీయించారు. దాంతో 50 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొందరు నడవలేని స్థితికి చేరుకున్నారు. తల్లిదండ్రులకు సమాచారం తెలియడంతో వారు వచ్చి విద్యార్థినులను ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలికలను చేతులపై ఎత్తుకెళ్తున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్