వైసీపీ గెలుపు కోసం శ్రమించిన కార్యకర్తలందరికీ సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు. "నిన్న జరిగిన ఎన్నికల్లో మండుటెండలు సైతం లెక్కచేయకుండా నాకు ఆశీస్సులు ఇవ్వడానికి సునామీలా తరలివచ్చిన వారందరికీ శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇప్పటివరకు సాగిన సుపరిపాలన, మరింత మెరుగ్గా కొనసాగుతుందని హమీ ఇస్తున్నా." అని పేర్కొంటూ ఆయన ట్వీట్ చేశారు.