‘వివేకం’ సినిమా చూసి ప్రజలు ఎన్నికల్లో ఓటు వేయాలని వైసీపీ నేత, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి అన్నారు. వైఎస్సార్ జిల్లా ఖాజీపేటలో రవీంద్రా రెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారం చేపడుతుందన్న ఆయన.. వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డికి మద్దతు ఇవ్వట్లేదని చెప్పారు . చంద్రబాబు పద్ధతి గల నాయకుడని, ప్రజలకు ఆయన మాత్రమే మేలు చేస్తారన్న నమ్మకం తనకుందని అన్నారు.