ఫర్నిచర్‌ను తీసుకెళ్లాలని వైసీపీ లేఖ

54చూసినవారు
ఫర్నిచర్‌ను తీసుకెళ్లాలని వైసీపీ లేఖ
ఏపీలో మరోసారి ఫర్చిచర్ వివాదం తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మరోసారి జేఏడీకి లేఖ రాశారు. ఫర్చిచర్‌ను వెంటనే తీసుకెళ్లాలని కోరారు. ఒకవేళ తీసుకెళ్లడం ఇష్టం లేకపోతే ఖరీదు చెబితే చెల్లిస్తామని లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే నాలుగు సార్లు లేఖ రాశామని, కేవలం వైసీపీపై నింద మోపడానికే స్పందించడం లేదా అని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్