కూటమికి కలిసొచ్చిన అత్యధిక ఓటింగ్

60చూసినవారు
కూటమికి కలిసొచ్చిన అత్యధిక ఓటింగ్
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో గతంతో పోలిస్తే 2% అధికంగా పోలింగ్ నమోదైంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కలుపుకుంటే 81.80% పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. అయితే పెరిగిన పోలింగ్.. చివరకు ప్రతిపక్ష పార్టీలకే కలిసొస్తున్నట్లు స్పష్టంగా తెలిసిపోతుంది. గతంలో కూడా పెరిగిన పోలింగ్ ప్రతిపక్షంలో ఉన్న YCPకి కలిసిరావడంతో 2019లో ఆ పార్టీ గెలిచింది. ఈసారి టీడీపీకి మెజార్టీ ఓట్లు వస్తుండడంతో టీడీపీ అధికారం చేపడుతుందేమో అన్నట్లు ఫలితాలు కొనసాగుతున్నాయి.

సంబంధిత పోస్ట్