ఇంజెక్షన్‌ వికటించి.. ఏడుగురు చిన్నారులకు అస్వస్థత

101298చూసినవారు
ఇంజెక్షన్‌ వికటించి.. ఏడుగురు చిన్నారులకు అస్వస్థత
కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని సర్వజన ప్రభుత్వ ఆస్పత్రిలో ఇంజెక్షన్‌ వికటించి ఏడుగురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. పిల్లల విభాగంలో 15 మందికి చికిత్స ఇస్తున్నారు. రోజూ మాదిరిగానే శుక్రవారం రాత్రి ఇంజెక్షన్‌ చేసిన తర్వాత చిన్నారులకు విపరీతమైన చలి జ్వరం రావడంతో వైద్యులు అప్రమత్తమయ్యారు. వీరిలో ఏడుగురిని ఐసీయూకు తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్