కోడలిని హతమార్చిన మామ

551చూసినవారు
కోడలిని హతమార్చిన మామ
కోడలిని హతమార్చిన ఘటన ప.గో. జిల్లా తాడేపల్లిగూడెంలో చోటు చేసుకుంది. జగన్నాథపురం గ్రామానికి చెందిన శ్రీనివాసరావు-నాగ శ్రావణి దంపతులు. వీరికి కుమారుడు రిశాంత్ కుమార్ (4), కూతురు సంతానం. శ్రీనివాసరావు దుబాయ్ వెళ్లడంతో నాగ శ్రావణి తన పిల్లలతో ఇంట్లోనే ఉంటుంది. కొడుకు రిశాంత్ తన వెండి మొలతాడు పోగొట్టుకోవడంతో అతడిని శ్రావణి కొట్టింది. దాంతో మామ కేశవరావు గొడవకు దిగాడు. అదే రోజు రాత్రి రోకలి బండతో శ్రావణిని కొట్టి చంపాడు.

సంబంధిత పోస్ట్