ఏపీలో హోరా హోరీ పోరు సాగింది. కౌంటింగ్ కి గడువు దగ్గర పడింది. మరొక వారం రోజులు ఓపిక పడితే ఎవరు విజేత అన్నది తేలనుంది. కొత్త ప్రభుత్వం వస్తే జూన్ నెలలో అసెంబ్లీ మొదటి సమావేశం జరుగుతుంది. ఈసారి అసెంబ్లీలో చాలా కళ కనిపిస్తుందని అంటున్నారు. జగన్, చంద్రబాబు, పవన్ లోకేష్ అంతా ఒకే వేదిక మీద కనిపించే చాన్స్ ఉంటుంది అని అంటున్నారు. పొజిషన్స్.. అపొజిషన్స్ ఎవరివి అయినా వీరంతా అసెంబ్లీలో మెరుస్తారని అంటున్నారు.