AP: ద్రోణి ప్రభావంతో రేపు రాష్ట్రంలో పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. మన్యం, అల్లూరి, ఏలూరు, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇవాళ శ్రీ సత్యసాయి, చిత్తూరు, విజయనగరం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 30 మి.మీలకు పైగా వర్షం కురిసినట్లు పేర్కొంది.