రేపు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు

15011చూసినవారు
రేపు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు
AP: రాష్ట్రంలో రేపు వ‌ర్షాలు కురుస్తాయ‌ని రాష్ట్ర విప‌త్తు నిర్వ‌హ‌ణ సంస్థ వెల్ల‌డించింది. విజయనగరం, మన్యం, అల్లూరి, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని తెలిపింది. ఉరుములతో వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చ‌రించింది. పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశు-గొర్రెల కాపరులు.. చెట్లు, క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించింది.

సంబంధిత పోస్ట్