తిరుమలను గత ఐదేళ్లలో అధ్వానంగా మార్చారని సీఎం చంద్రబాబు విమర్శించారు. 'దర్శనం కోసం బ్లాక్లో టికెట్లు అమ్ముకున్నారు. తిరుమల కొండపై నాన్వెజ్ తీసుకొచ్చారు. వెంకటేశ్వర స్వామిని ఊరూరు తిప్పారు. పెళ్లి, పేరంటానికి శ్రీవారిని తీసుకెళ్లారు. వెంకన్నకు ద్రోహం తలపెడితే ఈ జన్మలోనే శిక్ష తప్పదు. తిరుమల మొత్తం ప్రక్షాళన చేస్తాం. తిరుమలలో ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే నినాదం ఉండొద్దు' అని చంద్రబాబు అన్నారు.