ఆర్టీసి బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే

63చూసినవారు
చిత్తూరు - వేలూరు మధ్య రెండు నూతన హైరింగ్ బస్సులను ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆర్టీసీ బస్టాండులో సోమవారం జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చిత్తూరు జిల్లాకు ఇప్పటివరకు 70 నూతన బస్సులను మంజూరు చేసిందన్నారు. భవిష్యత్తులో ప్రజా సౌకర్యార్థం ఎలక్ట్రిక్ బస్సులను ఏర్పాటు చేస్తుందన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి సీఎం చంద్రబాబు అని కొనియాడారు.

సంబంధిత పోస్ట్