వీల్ ఛైర్ బహూకరించిన జనసైనికులు

67చూసినవారు
వెదురుకుప్పం మండలంలోని గొడుగుచింత గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం రెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడి మంచానికి పరిమితమయ్యాడు. బాధితుడికి ఆదివారం జనసేన ఇంచార్జి యుగంధర్ పొన్న స్థానిక కూటమి నాయకులతో కలసి వీల్ ఛైర్ ను అందజేశారు. కూటమి ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జనసేన మండల ప్రధాన కార్యదర్శి బెనర్జీ, నియోజకవర్గ బూత్ కన్వీనర్ యతీశ్వర్ రెడ్డి, చంద్ర రెడ్డి, మునిరత్నం పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్