డాక్టర్ కు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం

55చూసినవారు
కలకత్తాలో మహిళా వైద్యురాలిపై సామూహిక హత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించేంతవరకు పోరాటం సాగిస్తామని బీజేపీ సీనియర్ నాయకులు చిట్టిబాబు స్పష్టం చేశారు. గిరింపేట ఎన్పిఏస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద శుక్రవారం కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. దేశవ్యాప్తంగా పది రోజులుగా నిరసనలు చేపడుతున్న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందన్నారు. మహిళలకు భద్రత కరువవుతోందన్నారు.

సంబంధిత పోస్ట్