Jan 08, 2025, 16:01 IST/ములుగు
ములుగు
ములుగు: రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్దం చేసిన బీజేపీ నాయకులు
Jan 08, 2025, 16:01 IST
ములుగు జిల్లా కేంద్రంలో బీజేపీ నేతలు బుధవారం ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ నేతల దాడిని నిరసిస్తూ బీజేపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. బీజేపీ కార్యాలయంపై దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్దం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు