అన్నార్తుల కడుపులు నింపండి: కోట సునీల్ కుమార్ పిలుపు

71చూసినవారు
అన్నార్తుల కడుపులు నింపండి: కోట సునీల్ కుమార్ పిలుపు
గూడూరు పట్టణ పటేల్ వీధిలో ఉన్న సాయిసత్సంగ నోలయం నిర్వాహకులు డాక్టర్ కోట సునీల్ కుమార్ పట్టణంలో నిరాదరణకు గురైన వృధ్ధులు, అనాధలకు భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండుతున్న ఎండల్లో ఆకలి కడుపులను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా పట్టణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్