పూతలపట్టు: ఆటో ఢీకొని ద్విచక్ర వాహన దారునికి తీవ్ర గాయాలు

83చూసినవారు
పూతలపట్టు: ఆటో ఢీకొని ద్విచక్ర వాహన దారునికి తీవ్ర గాయాలు
పూతలపట్టు నియోజకవర్గం తవనంపల్లి మండలం టి. పుత్తూరుకి చెందిన రహమతుల్లా అనే వ్యక్తి శనివారం రాత్రి ద్విచక్ర వాహనంపై కాణిపాకం నుండి అగరంపల్లి వెళుతూ ఉండగా ఎదురుగా వచ్చిన ఆటో ఢీకొని తీవ్ర గాయాలు అయిన ఘటన చోటుచేసుకుంది. స్థానికులు గాయపడిన రహమతుల్లాను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కాణిపాకం పోలీసులుకి సమాచారం ఇచ్చారు.

సంబంధిత పోస్ట్