అనారోగ్యంతో నాలుగేళ్ల చిన్నారి మృతి

76చూసినవారు
అనారోగ్యంతో నాలుగేళ్ల చిన్నారి మృతి
అనారోగ్యంతో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుం మండలంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే మండల కేంద్రంలోని జాండ్రపేటకు చెందిన షేహాన్ షా కుమార్తె సభా పర్వీన్ గత ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతూ పీలేరులో చికిత్స పొందింది. ఈ క్రమంలో శుక్రవారం మళ్లీ చిన్నారి హఠాత్తుగా అస్వస్థతకు గురి కావడంతో 108 వాహనంలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్