మెట్లోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావాలి

62చూసినవారు
తిరుపతిలోని అలిపిరి వద్ద సోమవారం ఉదయం నిర్వహించే మెట్లోత్సవానికి వెంకటేశ్వర స్వామి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం శ్రీనివాస మంగాపురంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ శ్రీనివాస మంగాపురంలో ఉదయం స్వామివారి పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఆలిపిరి కి పాదయాత్రగా వెళ్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్