నందీశ్వరునికి వైభవంగా ప్రదోష పూజలు

73చూసినవారు
నాగలాపురం మండలం సురుటుపల్లి శ్రీ పల్లి కొండేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం త్రయోదశి సందర్భంగా నందీశ్వరునికి ప్రదోషపూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. నందీశ్వరునికి నిర్వహించిన అభిషేక పూజల్లో భక్తులు భారీగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు నందీశ్వరుని అభిషేకాల అనంతరం వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. నందీశ్వరునికి మహా హారతులు ఇచ్చారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్