ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం

73చూసినవారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. తిరుమల రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు కూటమి నాయకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గమున తిరుపతి అలిపిరికి బయలుదేరి వెళ్లారు.

సంబంధిత పోస్ట్