సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో గురువారం మధ్యాహ్నం 11. 40 నుంచి 12. 15 వరకు జల్లులతో కూడిన వర్షం కురిసింది. దీంతో గత నెల రోజులగా ఎండ వేడిమికి అవస్థలు పడుతున్న ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గ్రామాల్లో వరి, వేరుశనగ పత్తి పంటలు సాగు చేసిన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరెంత వర్షం పడితే ఎంతో మేలు జరుగుతుందని అంటున్నారు.