అబ్దుల్ కలామ్ ను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలి

74చూసినవారు
భారత రత్న డాక్టర్ ఏపీజె అబ్దుల్ కలామ్ వర్ధంతిని శనివారం సూళ్లూరుపేట ఉన్నత పాఠశాలలో విభిన్న ప్రతిభా వంతులైన చిన్నారులు ద్వారా నిర్వహించారు. అబ్దుల్ కలామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇస్రో ఉద్యోగి అప్పారావు కలామ్ జీవిత కథను, మిస్సైల్ మాన్ గా ఆయన చేసిన కృషిని వివరించారు. ఇస్రో ఉద్యోగి శ్యామ్, పూర్వ విద్యార్థి సంఘం సభ్యులు సురేష్, ఉస్మాన్ భాష, ఇన్చార్జి హెచ్ ఎం చలపతి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్