ఉదయగిరి మండలం దేకురుపల్లి గ్రామంలో ఈపీఓఆర్టి ఎన్. మల్లికార్జునరావు సోమవారం పర్యటించారు. గ్రామస్తులకు డయేరియా వ్యాధిపై అవగాహన కల్పించారు. చుట్టూ మురికిగుంటలు ఉండడంతో డయేరియా వ్యాధి త్వరగా వేగవంతం అవుతుందని తెలిపారు. ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. ఆయన వెంట వెల్ఫేర్ అసిస్టెంట్ ఏడుకొండలు, వేణు అంగన్వాడీ కార్యకర్త శివమ్మ, వైద్య ఆరోగ్య సిబ్బంది ఉన్నారు.